Tuesday, April 30, 2024

జార్ఖండ్‌లో రైల్వే ట్రాకు పేల్చివేసిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

Maoists blow up railway track in Jharkhand

 

లతేహర్/మెడినినగర్: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బర్కాకానా-గర్వామార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచూఘుటా, డెమూ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేసినట్లు పలము రేంజ్ డిజిపి రాజ్ కుమార్ లక్రా తెలిపారు. నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) పార్టీ అగ్ర నాయకుడు ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా అరెస్టుకు నిరసనగా శనివారం దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. రైల్వే ట్రాకులను రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పేలుడులో ఒక డీజిల్ ఇంజన్‌కు చెందిన ట్రాలీ ధ్వంసమైనట్లు ఇసిఆర్ రైల్వే ప్రతినిధి పికె మిశ్రా చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News