Thursday, March 28, 2024

కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పెగడపల్లిః కడుపు నొప్పి బాధ భరించలేక జీవితంపై విరక్తి చెందిన వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బత్కెపల్లి అనుబంధ గ్రామం కొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని బత్కెపల్లి గ్రామ ఆమ్లెట్ గ్రామమైన కొండయ్య పల్లి గ్రామానికి చెందిన జోగు లత (38) గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుంది.

దీంతో చికిత్స చేయించుకున్నను కడుపు నొప్పి బాధ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కుమార స్వామి తెలిపారు. భర్త తిరుపతి, తల్లి జవ్వాజి లక్ష్మిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News