Tuesday, April 30, 2024

ఏఎస్‌రావునగర్‌లో పర్యటించిన నగర మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిగురువారం డాక్టర్ ఏఎస్‌రావునగర్ డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేశారు. డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్‌కాలనీ, సుభ్రమాణ్యనగర్‌కాలనీలో డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి వీరిషసోమశేఖర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసి అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని నాలాలు, రోడ్లను పరిశీలించారు.

డివిజన్‌లో నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ మేయర్‌కు వివరించారు. సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని మేయర్‌ను కోరారు. సానుకులంగా స్పందించిన మేయర్ డివిజన్‌తో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ పర్యటనకు వచ్చి నగరమేయర్‌ను కార్పొరేటర్ వీరిషరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఈ హరిలాల్, ఎఈ కీర్తి, నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News