Friday, May 3, 2024

ఇంట్లో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఇంట్లో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయవాడలోని చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యూష అనే యువతి విజయవాడలోని పిబి సిద్థార్ధ కాలేజీలో ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతుంది. కాగా ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు యువతి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్గ్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రత్యూష తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News