Thursday, May 2, 2024

బైక్‌ను ఢీకొట్టిన కారు: కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటి కారిడార్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ధనుంజయ్ అనే కానిస్టేబుల్ తన భార్య, పిల్లలతో బైక్‌పై వెళ్తుండగా వారిని కారు ఢీకొట్టింది. ధనుంజయ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ధనుంజయ్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News