Thursday, May 2, 2024

రేషన్ షాపులను పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్ పట్టణంలోని రేషన్ షాపులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జి.ఎల్. శర్మలు పరిశీలించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేషన్ షాప్, అంగన్‌వాడీ సెంటర్, హాస్టల్స్, సూళ్ళలో బియ్యం నాణ్యతను ఇబ్బందులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జి.ఎల్. శర్మలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపులు సమయపాల పాటించాలని తప్పకుండా కీ రిజిస్టర్ అమలు చేయాలని లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్నారు. ఫోర్ట్‌ఫైడ్ ప్రాముఖ్యతను ప్రజకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మెదక్‌లో ఎఎల్‌ఎస్ గోదాంను సందర్శించి బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌వో శ్రీనివాస్, డిఈవో, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా మెట్రోలజీ అధికారి, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షడు ఆనంద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదీతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News