Thursday, May 2, 2024

సింగరేణి కాలనీలో అర్ధరాత్రి ఘర్షణ

- Advertisement -
- Advertisement -

Midnight clash at Saidabad police station limits

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. సింగరేణి కాలనీలో ఇద్దరు యువకులపై ఉదయ్ కిరణ్ అతని అనుచరులు దాడి చేశారు. సింగరేణి కాలనీ గుడిసెల విషయంలో వివాదంపై రాజీ కోసం పిలిచి దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాడ్లతో కొట్టి కడుపులో పొడిచారని నవీన్, శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఉదయ్ కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Midnight clash at Saidabad police station limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News