- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 12,689 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 137మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 13,320 కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,89,527 దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,76,498 కరోనా యాక్టివ్ కేసులుండగా, 1,03,59,305 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో మరణాల సంఖ్య 1,53,724 పెరిగింది. దేశంలో మొత్తం 20,29,480 మందికి టీకాలు వేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, భారత్ లో మంగళవారం వరకు మొత్తం 19,36,13,120 కోవిడ్ టెస్టులు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది. నిన్న 5,50,426 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
- Advertisement -