Saturday, April 27, 2024

ఖమ్మం అగ్నిప్రమాద ఘటనపై మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా అగ్నిప్రమాద ఘటనపై మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోవడం బాధాకరమన్న మంత్రి ఖమ్మం జిల్లా నేతలకు ఫోన్ చేసి వివరాలు అడిగితెలుసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో హరీశ్ రావు మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే నిమ్స్ కు తరలించాలని సూచించారు.

ఈ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చనిపోయారని సిపి విష్ణు వారియర్ వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి పరిస్థితి బాగానే ఉన్నట్లు సిపి తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక హెడ్ కానిస్టెబుల్ గాయాలైనట్లు సిపి వెల్లడించారు. గాయపడిన అందరికి ఖమ్మంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని ఖమ్మం సిపి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News