Thursday, May 2, 2024

అవయవదానంలోనూ మనమే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అవయవదానంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అవయవ దానం పవిత్ర కార్యక్రమమని, ‘అవయవ దాతగా ఉండండి.. ప్రా ణాలను రక్షించండి’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా పిలు పునిచ్చారు. తాము మరణించిన తర్వాత తమ అవయవదానాలను మరొకరికి ఇవ్వ డం ద్వారా వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారమవుతామ న్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నా రు. ప్రస్తుతం దేశంలోనే ‘అత్యధిక సంఖ్య లో మరణించిన దాతలు ఉన్న రాష్ట్రం’ గా తెలంగాణకు అవార్డు లభిస్తోందని, పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News