Friday, May 3, 2024

ప్రతి తెలంగాణ బిడ్డ దేశానికే డబుల్ ఇంజిన్

- Advertisement -
- Advertisement -

‘బీమారు’ రాష్ట్రాల బిజెపి నేతలది విభజన అజెండా

మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కంటే
మెరుగైన అభివృద్ధి ఉంటే
చూపండి సింధియాకు
మంత్రి కెటిఆర్ సవాల్
మా రాష్ట్రం మాదిరిగా కష్టపడితే
10 ట్రిలియన్ల ఎకానమీకి
చేరుకునేవాళ్లం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పం దించారు. పాలనలో విఫలమైన బీమారు (BIMARU) రాష్ట్రాల్లోని (దేశంలో అత్యంత వె నుకబడిన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు) నాయకుల చిత్తశుద్ధిని మీరు నిజంగా మెచ్చుకోవాలని సింధియాను ఉద్దేశించి కెటిఆర్ ట్వీట్ చేశారు. వారు తెలంగాణకు వచ్చి విభజన రాజకీయ ఎజెండాను ముం దుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని మం డిపడ్డారు. మీ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉం టే చూపించాలని మంత్రి కెటిఆర్ సింధియాకు సవాల్ విసిరారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ దేశానికి 5 శాతం జిడిపిని కం ట్రిబ్యూట్ చేస్తుందని కెటిఆర్ మరో ట్వీట్ చేశా రు. ప్రతి తెలంగాణ పౌరుడు ఈ దేశానికి డబుల్ ఇంజిన్‌గా దోహదపడ్డాడని పేర్కొన్నారు. తెలంగాణ వలే బిజెపి పాలిత రాష్ట్రాలు కష్టపడితే 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఈ దేశం 10 ట్రిలియన్ల ఎకానమీకి చేరుకునే అ వకాశం ఉండేదని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News