Wednesday, May 15, 2024

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR condemned Akbaruddin's remarks

హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహరావు, ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ మాజీ సిఎం ఎన్టీఆర్ పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి కెటిఆర్ ఖండించారు. దీనిపై కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ”మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు.” అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News