Saturday, May 4, 2024

కారుకు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమం మన చేతుల్లోనే

- Advertisement -
- Advertisement -

Vemula Prashanth Reddy Election Campaign in Quthbullapur

నిజాంపేట: కారు గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి, సంక్షేమం మన చేతుల్లోనే ఉంటాయని, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి రావుల శేషగిరిరావును భారీ మేజార్టీతో గెలిపించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజులరామారం డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి రావుల శేషగిరిరావును గెలిపించాలని బుధవారం ఆయనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్‌రాజులు పాల్గొని డివిజన్ పరిధిలోని లెనిన్‌నగర్, ఎన్‌టిఆర్‌నగర్‌లలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మనకు అభివృద్ధి కావాలంటే ఢిల్లీ నాయకులు అవసరం లేదని, గల్లీ నేతలను గెలిపించాలని కోరారు. సిఎం కెసిఆర్ ప్రకటించిన నూతన పథకాలు జిహెచ్‌ఎంసి అభివృద్ధికి నాంది పలుకుతాయన్నారు.

టిఆర్‌ఎస్ అభ్యర్థి రావుల శేషగిరిరావు మాట్లాడుతూ… డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి పరిచామన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే డివిజన్‌ను మరింత అభివృద్ధి పరుస్తానన్నారు. డిసెంబర్ 1వ తేదిన జరిగే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు యువకులు వారి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వారు పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షులు విజయరామిరెడ్డి, నాయకులు ఇంద్రసేనగుప్త, తిరుపతిరెడ్డి, కస్తూరి బాల్‌రాజు, రశీద్‌బేగ్, అంజన్‌గౌడ్, కమలాకర్, ఆబిద్, గోవర్ధన్‌రెడ్డి, పర్ష శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ సాయి, నవాబ్, ఇబ్రహీం, అరిగే సురేష్, చిట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Vemula Prashanth Reddy Election Campaign in Quthbullapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News