Monday, April 29, 2024

రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

993 New covid -19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 993 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 161 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 2, భద్రాద్రి 67, జగిత్యాల 39, జనగాం 8, భూపాలపల్లి 12, గద్వాల 5, కామారెడ్డి 23, కరీంనగర్ 46,ఖమ్మం 57, ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 15, మహబూబాబాద్ 31, మంచిర్యాల 28, మెదక్ 27, మేడ్చల్ మల్కాజ్‌గిరి 93, ములుగు 25, నాగర్‌కర్నూల్ 14, నల్గొండ 45, నారాయణపేట్ 0, నిర్మల్ 8, నిజామాబాద్ 20, పెద్దపల్లి 21, సిరిసిల్లా 25, రంగారెడ్డి 62, సంగారెడ్డి 34, సిద్ధిపేట్ 17, సూర్యాపేట్ 21, వికారాబాద్ 10, వనపర్తి 9, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ లో 39, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,66,042కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,53,715కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

రెండు లక్షల 53 వేల మంది కోలుకున్నారు….

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు రెండు లక్షల 53 వేల మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. వైరస్ సోకిన బాధితులకు సకాలంలో వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. దీంతో రికవరీ రేట్ కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 95.36 శాతం రికవరీ రేట్ నమోదు కాగా, ఈ శాతం మరేరాష్ట్రంలోనూ లేదని అధికారులు అంటున్నారు.

44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు…

రాష్ట్రంలో మరో 44 శాతం మంది ప్రైమరీ కాంటాక్ట్‌లకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాటు మరో 12 శాతం మంది సెకండరీ కాంటాక్ట్‌లకు కూడా టెస్టులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల 48 వేల 807 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 41 వేల మందికి టెస్టులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News