Tuesday, April 30, 2024

పరిశ్రమను పట్టించుకోండి

- Advertisement -
- Advertisement -

Minister KTR Letter To Union Finance Minister Nirmala Sitharaman

ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి

హైదరాబాద్—బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్‌లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్‌లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల
ప్రతిపాదనలను కేంద్రానికి
పంపుతాం రక్షణ రంగ
పారిశ్రామిక ఉత్పత్తి
కారిడార్‌లో
హైదరాబాద్‌ను చేర్చాలి
నేషనల్ డిజైన్ సెంటర్
ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వండి
కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్‌కు
మంత్రి కెటిఆర్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు కోరా రు. ఈ మేరకు మంత్రి నిర్మల సీతారామన్‌కు పలు అంశాలపైన ఆయన సవివరంగా లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరోసారి ఆ లేఖలో మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆ లేఖలో కెటిఆర్ పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు వంటి నిర్మాణాలు పూనుకుందన్నారు. ఐటి, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా ప్రగతిని సాధిస్తున్న నేపథ్యంలో కేంద్రం తన వంతు సహకారం అందించాలన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కెటిఆర్ కోరారు.

హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ. 5003 కోట్లు కేటాయించండి!

ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు కి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కెటిఆర్ కోరారు. ఫార్మాసిటికి మాస్టర్ ప్లాన్ కోసం రూ. 50 కోట్లు, రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి ఎక్స్టర్నల్ మౌలిక వసతుల కోసం రూ. 1399 కోట్లు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఆధారంగా పనిచేసే ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి అంతర్గత మౌలిక వసతుల కోసం మరో రూ. 3554 కోట్లను మొత్తంగా అన్ని కలిపి హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ. 5003 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్, నిర్మల సీతారామన్ ని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు మౌళిక వసతుల కల్పనకు సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫార్మా రంగంలో అద్భుతమైన ప్రగతికి హైదరాబాద్ ఫార్మాసిటీ ఒక కేంద్రంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా సిటీకి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోదాకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల తో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యత ఉన్నట్లు అంగీకరించిందని వివరించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్‌లకు నిధులు

రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ కారిడార్‌లకు నిధులు కేటాయించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-…వరంగల్, హైదరాబాద్… -నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌లను గుర్తించిందన్నారు. ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్‌లలో ఒక్కొదానికి రూ. 1500 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 3వేల కోట్లను కనీసంగా రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్రాన్ని లేఖలో కోరారు.అలాగే హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నొడ్లకు (Nodes)లకు అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మరింత వేగంగా కల్పించాలన్నారు. ప్రతిపాదిత రెండు నోడ్లలో మౌలిక వసతుల కల్పన చేసేందుకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ నాగపూర్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల నొడ్‌ను కొత్తగా గుర్తించాలన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్‌లలోని ఈ మూడు నోడ్లకు రెండు వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలను రానున్న వార్షిక బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్‌బెంగళూరు, హైదరాబాద్‌విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్‌లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ రెండు కారిడార్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా స్వీకరించిందన్నారు. ఇప్పటికే హుజురాబాద్, జడ్చర్ల-, గద్వాల్, – కొత్తకోట నొడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రెండింటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామన్నారు.

డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలి

గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్‌ను చేర్చాలని మంత్రి కెచిఆర్ కోరారు. తెలంగాణ దేశానికి భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందన్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువన్నారు. దీంతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబరేటరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇసిఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బెల్ వంటి అనేక రక్షణ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. వీటితో పాటు టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్‌తో పాటు అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ, ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ర్ గుర్తు చేశారు. దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఉన్న హైదరాబా ద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఉన్నదన్నా రు.

డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాన్ని ఒక ప్రాధాన్యతా రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో భారీగా పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాదన్నారు. ఇప్పటికే హైదరాబాదులో రెండు ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కులను ఏర్పాటు ఉన్నయన్నారు. దీంతోపాటు త్వరలో మరో భారీ ఏరోస్పేస్,డిఫెన్స్ పార్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లోనూ ఏరోస్పేస్ క్లస్టర్‌ని సిద్ధం చేసే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, సి కోర్క్ రువాగ్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్‌ని ఎంచుకున్నాయన్నారు. ఇక్కడ కనీసం 1000 కి పైగా సూక్ష్మ, మధ్యతరహా కంపెనీలు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. ఉన్నత విద్య సంస్థలతోపాటు అద్భుతమైన మానవ వనరులతో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయని వివరించారు. తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్లలో భాగంగా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు

రాష్ట్రంలో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కేంద్రంతో జరిగిన చర్చల సందర్భంగా మీ (నిర్మలా సీతారామన్) సూచన మేరకు నూతన నేషనల్ డిజైన్ సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. హైదరాబాదు లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్ష్‌లోనే నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణ యం తీసుకున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సెం టర్ ఏర్పాటుకు పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్‌రు సంబంధించి 8 సంవత్సరాల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు కోరుతున్నామన్నారు. 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు నేషనల్ డిజైన్ సెంటర్ కు నిధులు కేటాయించాలని కెటిఆర్ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News