Saturday, July 27, 2024

దైవ సన్నిధి

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

తిరుమలలో స్వామివారి ఏకాదశ దర్శనం కోసం సకుటుంబంగా మంత్రి కెటిఆర్

తిరుపతి/హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహంలో బసచేశారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో కెటిఆర్ కుటుంబసభ్యులకు ఎపి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి స్వాగతం పలికారు. శాలువతో సత్కరించి తిరుమల శ్రీవారి జ్ఞాపికను బహుకరించారు. అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మధుసుదన్ రెడ్డి కెటిఆర్‌ను శాలువతో సత్కరించి శ్రీకాళహస్తి స్వామివారి చిత్రపటాన్ని ఇచ్చారు. సోమవారం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. విమానశ్రయంలో పలువరు ప్రజాప్రతినిధులు, సిఎం కెసిఆర్, కెటిఆర్ ఆభిమానులు కెటిఆర్‌తో సెల్ఫీలు దిగారు.

Minister KTR who went to Tirumala
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News