Tuesday, April 30, 2024

గృహ నిర్మాణ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  గృహ నిర్మాణాలకు సంబంధించి అధికారులతో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ శాఖలో నెలకొన్న పలు సమస్యలు, అంశాల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ స్వగృహలో భాగమైన గృహనిర్మాణాలకు సంబంధించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News