Monday, April 29, 2024

11న ఐదో గ్యారంటీ

- Advertisement -
- Advertisement -

భద్రాచలంలో సిఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
ఈ ఏడాది 4.5ంలక్షల ఇళ్ల నిర్మాణం తొలివిడతగా ఈ ఏడాది
నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తొలుత సొంత ఇంటి స్థలంలో నిర్మాణానికే
ప్రాధాన్యం గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తోందని, ఐదవ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఈ నెల 11న భద్రాచలం రాములోరి సన్నిధిలో సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని రెవెన్యూ, హౌ సింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత గా ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మం జూరు చేస్తున్నామని వెల్లడించారు.

హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని మంతి అన్నారు. ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల అని అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే అని ఆయనన్నారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని, తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని ఆయన విమర్శించారు. ప్రజల అవసరాలను, ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని అన్నారు. మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సహాయం అందించడానికి అవసరమైన కార్యచరణను ప్రారంభించిందని మంత్రి పొంగులేటి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమీషనర్లు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయనున్నామని,400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్లను నిర్మించాలని, హాలు, బెడ్ రూమ్ తో పాటు వంటగది, బాత్ రూమ్ తప్పనిసరిగా ఉండాలన్నారు.మహిళల పేర ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంభందించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News