Sunday, April 28, 2024

పాడైంది పన్ను కాదు..వెన్ను

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నీచమై న భాషకు అధ్యుడు మాజీ సిఎం కెసిఆర్ అని, ఒక్క పన్ను పాడైతే అన్నీ పికేసుకుంటామా, ఎన్నికల్లో ప్ర జలు అత్యాశకు పోయారని, సిఎం రేవంత్‌రెడ్డి భాషపైన కరీంనగర్ సభలో మాజీ సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కెసిఆర్ చెప్పినట్లుగా పాడైంది ఒక్క పన్ను అయితే బాగుండేదని, కానీ ఆయన అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ అని అన్నారు. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. మనిషి శరీరంలో కాళ్లు, చేతులు, ముక్కు, ముఖం ఇలా అన్ని బాగానే ఉన్నా వెన్నెముక విరిగిపోతే ఎ లా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉందని, మేడిగడ్డ తరువాత అన్నారం సుం దిళ్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ అవినీతి జబ్బు ఒక మే డిగడ్డకే పరిమితం కాలేదని ఆ జబ్బు అన్నారం సుందిళ్ళకు కూడా పాకిందని మండిపడ్డారు.

తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపీ మేస్త్రి అనే వి ధంగా వ్యవహరించారని కాళేశ్వరం కెసిఆర్ అవినీ తి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనమని వి మర్శించారు. ఎత్తిపోతల తిప్పిపోతల కాళేశ్వరం ప్రాజెక్ట్ వెన్నెముక అయిన మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేరకు కుంగినవని సాక్షాత్తు ఎన్‌డిఎస్‌ఏ , కేంద్ర ప్రభుత్వ జల వనరుల నిపుణులు, మన ప్రభుత్వ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు, మేధావులు, రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రిక ల ఎడిటర్లు, జర్నలిస్ట్‌లు ఇలా ప్రజలు అందరూ ఏకరువు పెడుతుంటే అపర ఒక ప్రకటనలో కెసిఆర్ చెప్పినట్లుగా పాడైంది ఒక్క పన్ను అయితే బాగుండేదని, కానీ ఆయన అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ అని అన్నారు. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. మనిషి శరీరంలో కాళ్లు, చేతులు, ముక్కు, ముఖం ఇలా అన్ని బాగానే ఉన్నా వెన్నెముక విరిగిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉందని, మేడిగడ్డ తరువాత అన్నారం సుందిళ్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కెసిఆర్ అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే పరిమితం కాలేదని ఆ జబ్బు అన్నారం సుందిళ్ళకు కూడా పాకిందని మండిపడ్డారు. తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపీ మేస్త్రి అనే విధంగా వ్యవహరించారని కాళేశ్వరం కెసిఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఎత్తిపోతల తిప్పిపోతల కాళేశ్వరం ప్రాజెక్ట్ వెన్నెముక అయిన మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేరకు కుంగినవని సాక్షాత్తు ఎన్‌డిఎస్‌ఏ , కేంద్ర ప్రభుత్వ జల వనరుల నిపుణులు, మన ప్రభుత్వ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు, మేధావులు, రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్ట్‌లు ఇలా ప్రజలు అందరూ ఏకరువు పెడుతుంటే అపర మేధావి కెసిఆర్ సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలు పాల్గొనకుండా పారిపోయిన పెద్దమనిషి 80వేల పుస్తకాలు చదివిన మేధావి కాళేశ్వరం రూపశిల్పి ఇప్పుడు టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతారంట అని ఎద్దేవా చేశారు. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బిఆర్‌ఎస్ ఉంటుందని కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ టిఆర్‌ఎస్ స్థానంలో కెసిఆర్ ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని, దేశంలో గత్తర లేప్త భూకంపం సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో పోటీ చేయలేక చేతులెత్తేయగా, ఉన్న రాష్ట్రంలో ప్రజలు కెసిఆర్ కుర్చీ మడత పెట్టారని, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా బిఆర్‌ఎస్ కు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కెసిఆర్ పాలనలో జరిగిన పాలనపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా మా ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిందని, అప్పటికే వర్షాకాలం సీజన్ ముగిసిందనే విషయాన్ని గత పాలకులు గుర్తుంచుకోవాలన్నారు.

ప్రజలు అత్యాశకు పోయారని ప్రజాతీర్పును కెసిఆర్ చులకన చేస్తున్నారని, తనకు ఓటు వేసినంత కాలం ప్రజలు మంచివారు, వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం ప్రజలకు తెలివి లేదు మూర్ఖులు అన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును ఆమోదిస్తున్నామని నేటి వరకు ఆయన నోటినుండి వెలువడలేదని, ప్రజా తీర్పును ప్రశ్నించేలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను కాపీ చేసి రూ. 400కు సిలిండర్ ఇస్తానంటే కూడా కెసిఆర్ హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. సిఎం రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్లే ఉందని, పీకడానికి , తోక మట్ట బొందలగడ్డ సన్యాసి వంటి పదాలను అలవోకంగా వదిలేసింది ఉద్యమనేత కాదా తెలంగాణ రాజకీయాల్లో నీచమైన భాష తిట్ల ప్రయోగాలకు కెసిఆర్ ఆద్యుడు అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News