ఖమ్మం : టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం పుట్టినరోజు కేక్ ను కట్ చేసి కెటిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఆయనకు శక్తిని ఇవ్వాలని ప్రార్ధించారు. కెటిఆర్ గారు ఇలాగే మరెన్నో జన్మదిన ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కెటిఆర్ చేపట్టిన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కెటిఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి సంతోష్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నేడు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో లక్ష మొక్కలు నాటి కెటిఆర్ గారికి జన్మదిన కానుకగా అందిస్తున్నాం అన్నారు.