Friday, May 3, 2024

బిహార్ సిఎం నితీష్‌కు షాక్.

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ రాజకీయాల్లో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు , జితిన్ రామ్ మాంఝీ తనయుడు సంతోష్‌కుమార్ సుమన్ షాక్ ఇచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సుమన్ తన పదవికి రాజీనామా చేశారు. తన పార్టీ హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఎఎం)గా మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.

హెచ్‌ఎఎంను సుమన్ తండ్రి మాజీ సిఎం జితిన్ రామ్ మాంఝీ స్థాపించారు. అయితే ఆయన రాజీనామా వెంటనే ఆమోదిస్తారా లేదా అన్నది తెలియలేదు. రాష్ట్రంలో పాలక కూటమి మహాఘట్ బంధన్ నుంచి నలుగురు ఎమ్‌ఎల్‌ఎలున్న హెచ్‌ఎఎం వీడిపోయినా, దాని ప్రభావం ప్రభుత్వంపై ఉండదని పాలక వర్గాలు వ్యాఖ్యానించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News