Saturday, May 18, 2024

మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ లోకి 3.5 లక్షల మంది చేరిక

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్ : మహారాష్ట్ర లోని 15,000 గ్రామాలకు చెందిన 3.5 లక్షల మంది కార్యకర్తలు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల భారత రాష్ట్ర సమితి లో తమ సభ్యత్వాలను కొత్తగా నమోదు చేసుకున్నారని బీఆర్‌ఎస్ నాయకులు వెల్లడించారు. బీఆర్‌ఎస్ కిసాన్ విభాగం అధ్యక్షుడైన మాణిక్ కదం ఇంత వరకు దాదాపు 2 లక్షల మంది కొత్తగా మహారాష్ట్రకు చెందిన కార్యకర్తలు ఆన్‌లైన్ ద్వారా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారని వివరించారు. ఇంటర్నెట్ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ తాము ఆఫ్‌లైన్ ప్రక్రియను అనుసరిస్తున్నామని, ఆఫ్‌లైన్ ద్వారా తాము 1.5 లక్షల మంది కొత్త కార్యకర్తలను తమ వివిధ విభాగాల ద్వారా పొందగలిగామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News