Thursday, May 2, 2024

రైతు కూలీలు, కార్మికులకు బీమా కల్పిస్తాం: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. క్వింటాకు 5 కిలోలు తరుగు తీసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యాన్ని పొరుగు జిల్లాల మిల్లులకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్వింటాకు రూ. 2500 చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదనపు కోతలు లేకుండానే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతు కూలీలు, కార్మికులకు కూడా బీమా కల్పిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News