Thursday, May 2, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన ఎంఎల్ఎ కోరుకంటి

- Advertisement -
- Advertisement -

రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…..

MLA Korukanti chander plant tree

హైదరాబాద్: ఎంపి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జమ్మి చెట్టును ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నాటారు. ఎంఎల్ఎ కోరుకంటి చందర్ పుట్టినరోజు సందర్భంగా సిఎం కెసిఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని  ఎంపి సంతోష్ కుమార్ కోరారు. సిఎం కెసిఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం  కావడంతో పాటు మొక్కలు  నాటాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.

ఈ దసరా పండుగ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరు ఊరుకో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా రామగుండం నియోజవర్గంలో పెద్ద ఎత్తున జమ్మిచెట్లు నాటుతామన్నారు. మన రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేల ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ కి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News