Thursday, June 12, 2025

‘మందుల’.. గిదేందయ్యా!

- Advertisement -
- Advertisement -

లిక్కర్ సిండికేట్ నుండి ముడుపులకు ఎంఎల్‌ఎ డిమాండ్ ఎంఎల్‌ఎ
నివాసంలోనే వీడియో రికార్డు చేసిన మద్యం వ్యాపారులు వైన్స్
సిండికేట్ బేరసారాలు అంటూ సోషల్‌మీడియాలో వైరల్ ఇంట్లోకి
వచ్చి వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సామేల్ మండిపాటు
ఎంఎల్‌సి మల్లన్న కుట్ర చేస్తున్నాడంటున్న తుంగతుర్తి ఎంఎల్‌ఎ

మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: ‘ఎన్నిక ల్లో కోట్లు ఖర్చుపెట్టా.. మళ్ళీ పోటీ చేస్తానో లే దో తెలియదు.. ఖర్చులన్నీ ఎక్కడ నుండి వస్తా యి.. అన్నీ రికవరీ చేయాలి.. రోజుకు లక్షఖ ర్చు వస్తుంది.. మీరిచ్చేవి టీ ఖర్చులకు సరిపో వు.. ఎవరేం చెప్పినా డబ్బులు ఇవ్వాల్సిందే.. మాటవినకపోతే మీసంగతి చూస్తా..’ అంటు న్న ఓ వీడియో బట్టబయలైంది. ఈ వీడియో వ్యవహారం పెద్దచర్చకు దారితీస్తోంది. అయితే ఎవరా అధికార పార్టీ ఎంఎల్‌ఎ? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. లిక్కర్ సిండికేట్ వ్యాపారులతో స్వయంగా తన నివాసంలోనే తుంగతుర్తి ఎంఎల్‌ఎ మందుల సామేల్ చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది.

మద్యం వ్యాపారులు సీక్రెట్ కెమెరాతో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బయటపెట్టారని అంటున్నారు. లిక్కర్ సిండికేట్ ముడుపుల వ్యవహారం వీడియోతో ఎంఎల్‌ఎ వివాదంలో చిక్కుకున్నారు. ఎంఎల్‌ఎ వాయిస్.. మద్యం వ్యాపారుల వా యిస్‌లతో వన్ బైవన్ చర్చ జరిగినట్లు వీడియో లో ఉండటం గమనార్హం. నియోజకవర్గంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడం.. నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాల్సిన శాసనసభ్యులు ముడుపు ల వ్యవహారంలో ఇరుక్కోవడంపై ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.

అయితే ఈ వీడియో లో ఎంఎల్‌ఎ ముఖం కనిపించకపోయినప్పటికీ ఆయన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నా యి. మద్యం సిండికేట్ వ్యాపారులు వీడియో ను లీక్‌చేయడం.. ప్రతిపక్షపార్టీ సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని హల్‌చల్ చేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఎంఎల్‌ఎ పైనే మద్యం సిండికేట్ మాఫియా ఇంత సాహసం చేశారంటే ఎంఎల్‌ఎ బాధను భరించలేకనా? మద్యం వ్యాపారులు తమవైపునకు చూడకుండా తప్పించుకునేందుకు ఇలా చేశా రా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇంట్లోకి పిలిచి మర్యాద ఇస్తే .. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు

ఎంఎల్‌ఎ తన నివాసంలో జరిగిన మద్యం సిండికేట్ ముడుపుల వ్యవహారం ఆరోపణలపై ఎంఎల్‌ఎ సామేల్ స్పందించారు. ‘ఎంఎల్‌ఎగా ఉన్న నా ఇంటికి పేదలంతా వస్తుంటారు.. వా రి సమస్యలు పరిష్కరిస్తుంటా.. మద్యం వ్యాపారులు కూడా నా ఇంటికి వచ్చారు.. వారికి టీ ఇచ్చి మర్యాదతో మాట్లాడాను.. కానీ వీడియోలు తీసి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు’ అని సామేల్ మండిపడ్డారు. దళితుడినని ఓర్వలేక ఎంఎల్‌ఎసి తీ న్మార్ మల్లన్న కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు. సీక్రెట్‌గా వీడియోలు తీసి తన పదవికి, ప్ర తిష్టకు మచ్చతెస్తున్న వారిపై అధిష్టానానికి ఫి ర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఆత్మాభిమా నం కలిగిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News