Monday, June 17, 2024

పట్టభద్రుల ఎంఎల్‌సి ప్రచారానికి తెర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వరంగల్ —– ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం(మే 27) ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుం ది. మూడు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు ఎంఎల్‌సి ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.పట్టభద్రుల ఎంఎల్‌సి బరి లో మొత్తం 58 అభ్యర్థులు ఉండగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. పట్టభద్రుల స్థానాల ఎన్నికల కోసం మూడు జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక కోసం మొత్తం 1,448 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వారిలో 724 మంది పిఒలు ఉండగా, 724 మంది ఒపిఒలు ఉన్నారు. పోలింగ్ సామాగ్రిని అధికారులు ఆయా జిల్లాల కేంద్రాల నుంచి పంపిణీ చేశారు. దినపత్రిక పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రం, ఓటు వేసేందుకు వినియోగించే ఊదారంగు స్కెచ్ పెన్, ఓటర్ల జాబితా సహా ఇతర ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందించారు.

ముగిసిన ఎంఎల్‌సి ఉప ఎన్నిక ప్రచారం
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఎంఎల్‌సి ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో శనివారం (మే 25) సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. ఎంఎల్‌సి ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎంఎల్‌సి ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సిఇఒ సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News