Thursday, April 18, 2024

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్ధం యాదాద్రి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి గర్భాలయంలోని స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అష్టోత్తర పూజలను నిర్వహించారు.

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీని ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. దర్శనం అనంతరం యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం నిమిత్తం రూ.62 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు ఎమ్మెల్సీ అందజేశారు. డీడీ రూపంలో ఉన్న రూ.62 లక్షల చెక్కులు అధికారులైన రాజు, నరేష్‌లకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News