Friday, May 3, 2024

కన్నీళ్లు రావు…కంట నిప్పులే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు…ముందుకెళ్లాలి…. తెలంగాణ ఉద్యమం తరహాలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా దాడులు చేస్తున్నారని, దాడులకు భయపడేది లేదని, మన సమయాన్ని వృధా చేస్తున్నారని, మనకు మిగిలిన సమయంలో డబుల్, ట్రిపుల్ పని చేయాలని వెనక్కి తగ్గొద్దని కవిత పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, ఈ లోపు మన సత్తా చూపించాలని ఆమె సూచించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆనాడు రాష్ట్రం కోసం కోట్లాడామని ఇకనుంచి దేశం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమయ్యిందని, తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావనీ, నిప్పులు వస్తాయని కవిత పేర్కొన్నారు.ఇండెక్సుల్లో కిందకు పడిపోయిన ఇండియా ప్రజల శక్తి, వారి ప్రేమ తెలిసిన వాళ్లం మనమని, ప్రజలను ఒక శక్తిగా మలుచుకున్నామని, ప్రతి చోట మన కార్యక్రమాలను అమలు చేయాలని కవిత పేర్కొన్నారు.

రెస్ట్ తీసుకునేది లేదు, రిలాక్స్ అయ్యేది లేదు, భారతదేశం ఒక మంచి దేశంగా ఉన్నా, ప్రస్తుతం ఇండియా అనేక ఇండెక్సుల్లో కిందకు పడిపోయిందని ఆమె తెలిపారు.ఇటువంటి దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ లోపు మన సత్తా చూపించాలని జాగృతి కార్యకర్తలకు కవిత సూచించారు. మన భాష, పండుగల మీద జరుగుతున్న వివక్షను ఉద్యమంలో భాగంగా ప్రజలకు వివరించామని, ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుపడేవాదని, ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే సంతోషంగా జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు.

అనేక మంది యువకులు, కళాకారులు పాల్గొంటున్నారని, స్కూల్ పాఠ్యాంశాల్లో బతుకమ్మ చేరిందని, సంస్కృతీ, సంప్రదాయాలకు చోటు లభించిందని రాష్ట్రం సాధించిన తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చుకున్నామని కవిత తెలిపారు.
నిరాశ, నిస్పృహాల్లో మేధావులు, కవులు
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నోబోబడిన సర్కార్లను బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తుంటే, పెద్ద పెద్ద పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తా కథనాలు రాస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తోంది. తెలంగాణలో చేసిందే దేశంలో చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడినప్పుడే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుకుంటుందన్నారు. కేంద్రం తప్పులను దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ తప్పులను ఎత్తి చూపితే దాడులు చేస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు.

తెలంగాణ జాగృతి ఒక బలమైన శక్తిగా ఉందని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఉన్నారని, 18 దేశాల్లో మన కమిటీలు పని చేస్తున్నాయని ఒక్క పిలుపు ఇస్తే ప్రతి రాష్ట్రంలో మన శాఖ ఏర్పడే శక్తి ఉందని కవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టిఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి, ఉద్యమ నేతలు దేవి ప్రసాద్, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News