Thursday, May 2, 2024

కాశీలో అడుగుపెడితే బంధాల నుంచి విముక్తి: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi offers prayers to Lord Shiva at Kashi

వారణాసి: కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గంగానదిలో పుణ్య స్నానం తరువాత కాశీ విశ్వనాథునికి మోడీ పూజలు చేశారు. గంగాజలంతో కాశీ విశ్వనాథునికి మోడీ అభిషేకం చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు గంగా నదిని కలుపుతు కారిడార్ నిర్మాణం జరిగింది. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు అందరికీ స్వాగతమన్నారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. ఎన్నో ఏళ్లు వేసి చూసిన సమయం ఆసన్నమైందని, కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతోందన్నారు. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించామని, పురాతన కాశీ ఆలయాన్ని పునరుద్ధరించామని, భారత ప్రాచీనతకు, సంస్కృతికి కాశీ ప్రతీక కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News