Tuesday, May 14, 2024

బిజెపితోనే బిఆర్‌ఎస్ ఓటమి సాధ్యం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక ఫలితాలు కొంత కాంగ్రెస్‌కు బలాన్ని చేకూరుస్తాయి కానీ బిఆర్‌ఎస్‌పై విజయం సాధించేంత కాదని బిజెపి నేత, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదు కేవలం బిజెపి మీదనే నమ్మకం ఉందన్నారు. పోంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరేవాడు.. కెసిఆర్ కాంగ్రెస్‌ని మేనేజ్ చేస్తాడని భయంతోనే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరకుండా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారని వెల్లడించారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పిన బిజెపి ఆ చర్యలు చేపట్టకపోవడంతో కొంత పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయని, కవిత అరెస్టు జరిగితే తెలంగాణలో పరిస్థితులు మారిపోతాయన్నారు.

ఢిల్లీలో దోస్తి.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా బిజెపితో బిఆర్‌ఎస్ ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని వెల్లడించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు బిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అందరూ కలిసి పనిచేయాలని, కానీ కాంగ్రెస్‌లో ఉండి కాదని బిజెపిలోకి వచ్చి కలిసి పని చేద్దామంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది కాంగ్రెస్‌లతో కాదు.. బిజెపి నాయకులతో పని మీద వెళ్లి ఉంటాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు అంటే నేను నమ్మనని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News