Thursday, May 2, 2024

హీరో బైక్ షోరూంను మూసివేసిన మున్సిపల్ అధికారులు

- Advertisement -
- Advertisement -

చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని లైసెన్స్‌లు లేకుండా నడుస్తున్న వ్యాపార సంస్థలను మూసివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేకుంగా గత ఎప్రిల్ నుండి లైసెన్స్ లేకుండా నడుస్తున్న హీరో బైక్ పోరూంను మూసివేయడం జరిగిందని తెలిపారు.

ఏప్రిల్ 2022 నుండి ఇప్పటి వరకు లైసెన్స్‌లు తీసుకొని వ్యాపార సంస్ధలను దశల వారీగా మూసివేయడం జరుగుతుందని అన్నారు. వ్యాపారస్ధులందరూ విధిగా లైసెన్స్‌లు పొంది పట్టణ అభివృద్దికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రభాకర్, ఇంచార్జ్ సానిటరి ఇన్స్‌పెక్టర్ సర్వర్, ఆర్‌ఐ శ్రీనివాస్, మున్సిపాలిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News