Monday, May 13, 2024

జీవ నదుల పరిరక్షిద్దామంటూ ఎన్‌ఎసిసి నావెల్ వింగ్ విద్యార్థులు ర్యాలీ

- Advertisement -
- Advertisement -

NACC Novel Wing Students Rally

మన తెలంగాణ /సిటీ బ్యూరో: జీవ నదులను పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్‌సిసి నావెల్ వింగ్ విద్యార్థులు పిలుపు నిచ్చారు. 2021 గంగా నది ఉత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రధాన నదులను పరిరక్షణకు యువతను భాగస్వామ్యం చేసేందుకు గాను ఎన్‌సిసి నావెల్ వింగ్ సీనియర్ విద్యార్థులు మంగళవారం ట్యాంక్‌బండ్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంగా నదితో పాటు ఇతర ప్రధాన నదుల పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు నదుల జలాలను కాలుష్యం చేయకుండా అవగాహన కల్పించడంతో పాటు ఇప్పటికే కాలుష్యం భారిన పడిన నదులను పరిశుభ్రం చేసేందుకు స్వయంగా నడుం బిగించాలన్నదే తమ అవగాహన కార్యక్రమం లక్షమని ఎన్‌సిసి నావెల్ వింగ్ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News