Monday, May 20, 2024

ఇప్పటికైనా.. జాతీయ హోదా ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభు త్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఒకప్పుడు ఎ డారి ప్రాంతంగా ఉన్న తెలంగాణ రా ష్ట్రం నేడు భారతదేశానికే ధాన్యాగారం గా మారుతోందన్నారు. ‘ఇలాంటి తరుణంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కు జాతీయ హోదాను అందించడం ద్వారా తెలంగాణ నీటి ప్రాజెక్టులకు మద్దతునివ్వాలని కేంద్రాన్ని డి మాండ్ చేస్తున్నాం. రాష్ట్ర సామాజిక, ఆ ర్థిక వికాసానికి మూల కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాలమూరురంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నాం. తొమ్మిదేళ్లలో తెలంగాణ సాగు రంగం సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా సూచించారు.

ఇందుకు సంబంధించి ఈ నెల 6న చె న్నైలో జరిగిన దక్షిణ ప్రాంతీయ సమా ఖ్య స్టాడింగ్ కమిటీ 13వ సమావేశం వివరాలకు సంబంధించిన వార్తా కథనా న్ని ఆయన ట్యాగ్ చేశారు. దక్షిణాది రా ష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెండిం గ్ విభజన సమస్యలు, కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీ య హోదా, లైంగిక వేధింపులపై సత్వర విచారణ తదితరాంశాలను సదరు స మావేశంలో తెలంగాణ ప్రస్తావించిన వి షయాన్ని మరోమారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్య లక్ష్మి, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టంపై ప్రస్తావించగా, వీటిలో రైతుబంధు, రైతు బీమాను దక్షిణ ప్రాంతీయ సమాఖ్య స్టాండింగ్ కమిటీ 31వ సమావేశంలో ప్రజెంటేషన్ అంశాలుగా సమావేశం ఎంపిక చేసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్స్ అంశాన్ని సమావేశం దృష్టికి తెలంగాణ తీసుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News