Sunday, April 28, 2024

కార్మికుడిని బలిగొన్న అధికారుల నిర్లక్షం

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ :విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం కారణంగా వీధి దీపాలు బిగిస్తున్నా మానే దత్తా ( 40) అనే పంచాయతీ కార్మికుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండ లంలోని కొల్హారి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం … కొల్హారి గ్రామంలో విద్యుత్ బల్బులు బిగించేందుకు మండలకేంద్రంలోని సబ్ స్టేషన్ నుండి ఎల్సి తీసుకొని సంబంధిత లైన్‌మెన్‌తో పాటు పంచాయతీ వర్కర్ మానే దత్త విద్యుత్ బల్బులు బిగించేందుకు విద్యుత్ స్థంభాలు ఎక్కారని తెలిపారు.

పలు చోట్ల విద్యుత్ బల్బులు అమర్చిన అనంతరం గ్రామంలో మరో విద్యుత్ స్థంభానికి బల్బు బిగించేందుకు మానే దత్తా స్థంభం ఎక్కడంతో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఘాతానికి గురై కిందపడి చనిపోయాడని తెలిపారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారుల నిర్లక్షం వలనే దత్తా చనిపోయాడని అతని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేపట్టే వరకు ఆందోళన విరమించబోమని బిష్టి బొమ్మను దహనం చేశారు.

విషయం తెలుసుకున్న ఎంపిడిఓ సునిత , విద్యుత్ ఎఈ గౌతమ్, ఇచ్చోడ సీఐ చంద్ర శేఖర్, నేరెడిగొండ ఎస్సై సాయన్న, గుడిహత్నూర్ పోలీస్ సిబ్బంది గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చలు జరిపారు.విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ తరపున మృతుని కుటుంబానికి రూ13 లక్షల నష్టపరిహారంతో పాటు మృతుడి భార్యకు రెండు సంవత్సరాల పాటు మృతుని జీతభత్యం చెల్లిచడంతోపాటు రెండు సంవత్సరాల అనంతరం మృతుడి భార్య గ్రామ పంచాయతీలో వర్కర్‌గా పని చేసుకోవచ్చని గ్రామస్తులకు వివరించడంతో గ్రామస్తులు సమ్మతించి ఆందోళణ విరమించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ బలిరాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News