హైదరాబాద్లోని బల్కంపేట ఎలమ్మ తల్లి ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందజేశారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానం కోసం నీతా అంబానీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆమె బ్యాంకులో దేవస్థానం అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని, దీనిపై వచ్చిన వడ్డీతో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేందర్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 23న హైదరాబాద్లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్కు హాజరైన నీతా అంబానీ
ఆ సమయంలో తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధికి సహకరించాలని ఆలయ ఈఓ కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళాన్ని ప్రకటించడంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇంతటి భారీ విరాళాన్ని అందించిన నీతా అంబానీ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. నీతా అంబానీ హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా ఎల్లమ్మను దర్శించుకొని వెళ్తుంటారు.