Wednesday, May 1, 2024

యాదాద్రిలో నిత్యపూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించు కున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరం భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనము తో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. కొండపైన అనుబంధ ఆల యమైన శ్రీపర్వతవర్ధినీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వ హించారు. కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి నిత్యపూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News