న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు దాడికి పాల్పడి.. 26 మంది పర్యాలకుల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పాకిస్థాన్పై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్కు తగిన గుణపాఠం నేర్పించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఉగ్రవాదులను అంతం చేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రకటించింది.
అయితే తాజాగా ఈ అంశంపై తొలిసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాద పోరాటంలో భారత్కు అన్ని దేశాలు అండగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రదాడికి పాల్పడినవారికి తగిన శిక్ష విధిస్తామని పేర్కొన్నారు. పిరికి దాడి చేసి.. అదో గొప్ప విజయంగా భావిస్తున్నారని అన్నారు. ఇది మోదీ ప్రభుత్వమని.. ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో భారతీయులే కాదు.. ప్రపంచమంతా భారత్తో నిలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.