Tuesday, April 30, 2024

23న ఆర్‌బిఐ వేలంలో రాష్ట్రానికి రూ. 500 కోట్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రిజర్వుబ్యాంక్ ఈ వారంలో నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రం రూ. 500 కోట్లు రుణంగా పొందనున్నది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాలు మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నాయి. ఈ నెల 23(మంగళవారం)వ తేదీన నిర్వహించే ఆర్‌బిఐ బాండ్ల ఈ వేలంలో రూ.18,900 కోట్లును రుణాలను సమీకరించనున్నాయి. వాటిలో తమిళనాడు రాష్ట్రం రూ.5 వేల కోట్లు, మహారాష్ట్ర రూ.4 వేల కోట్లు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రూ.3 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.2 వేల కోట్లు, తెలంగాణ రూ. 500 కోట్లుతో పాటు తదితర రాష్ట్రాలు నిధులను బాండ్ల వేలంలో నిధులు పొందనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News