Saturday, April 27, 2024

బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

one dead one injured in road accident at Abdullahpurmet

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. దంపతులు గిరిజకుమారి, హరినారాయణ సికింద్రాబాద్ వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News