Sunday, April 28, 2024

జన్యువులు, రుగ్మతలపై ఓయూలో అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ విభాగం బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎ. భరత్ సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొబైల్ సైన్స్ ప్రదర్శనను నిర్వహించింది. మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ థీం జీన్ హెల్త్ కనెక్ట్ జన్యువులు, జన్యు రుగ్మతలు, నివారణ వ్యూహాలు, చికిత్సపై అవగాహన కల్పించింది. ఓయూలోని వివిధ విభాగాలతో పాటు ఇతర అనుబంధ కళాశాలల నుంచి దాదాపు 300 మంది సభ్యులు సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించారు. ప్రొఫెసర్ బి. వీరయ్య, ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్, యుసిఎస్ అన్ని ప్రదర్శనలను సందర్శించి, భవిష్యత్తులో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థులు ప్రయత్నం చేయాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News