Thursday, May 2, 2024

నేటి నుంచి పాక్-లంక మొదటి టెస్టు

- Advertisement -
- Advertisement -

గాలే: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్థాన్‌శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు జరుగనుంది. ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది. సొంత గడ్డపై ఆడుతుండడం లంకకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు పాకిస్థాన్ కూడా సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంది. ఎలాగైనా దీనిలో గెలవానే పట్టుదలతో ఉంది. లంకకు కరుణరత్నె, పాకిస్థాన్‌కు బాబర్ ఆజమ్ సారథ్య వహిస్తున్నారు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News