Tuesday, May 14, 2024

సింహాసనంపై 70 ఏళ్లు… క్వీన్ ఎలిజబెత్ ప్లాటీనం జూబ్లీ వేడుకలు!

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ అంతటా క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబ్లీ(సింహాసనంపై 70 ఏళ్ల పూర్తి చేసుకున్న) వేడుకలలో భాగంగా శుక్రవారం మూడవ రోజున అలిసియా కీస్ , డయానా రాస్ వంటి గాయకుల పాప్ కచేరీ, ఎప్సమ్ డెర్బీ గుర్రపు పందెం ప్రధానంగా నిలిచాయి.  96 ఏళ్ల రాణి గుర్రపు పందెం అభిమాని,  అనేక థరోబ్రెడ్‌ గుర్రాల  యజమాని.  ఆమె కారణాంతరాల వల్ల   243వ డెర్బీ రేస్ కు హాజరుకాలేదు. ఈ కారణంగానే ఆమె  గౌరవార్థం ఇచ్చే థాంక్స్ గివింగ్ సేవను కోల్పోవలసి వచ్చింది.

మహారాణి సింహాసనంపై 70 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టిన సందర్భంగా నాలుగు రోజుల వేడుకలు… సైనిక కవాతు, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైపాస్ట్ , బ్రిటన్ , ప్రపంచవ్యాప్తంగా బీకాన్‌లను వెలిగించడంతో ప్రారంభమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News