- Advertisement -
హైదరాబాద్: విద్యావ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితుల్లో ఉందని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి బిఆర్ఎస్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిందించడం సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి అంటే భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐ ముందుందని, ఎన్డిఎస్ఎ నివేదిక ప్రకారమే కాళేశ్వరంపై పిసి ఘోష్ విచారణ చేపట్టిందని తెలియజేశారు. కమిషన్ సెలెక్టడ్ గా విచారణ చేపట్టిందని రామచందర్ పేర్కొన్నారు. కమిషన్ విచారణలో నిందితులు ఎవరన్నది తేల్చిందా? అని పిసి ఘోష్ విచారణ తర్వాత రాజకీయ నేతలను అరెస్టు చేశారా? అని రామచందర్ రావు ప్రశ్నించారు.
Also Read : మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు: భట్టి
- Advertisement -