Tuesday, May 7, 2024

కాంగ్రెస్, బిజెపి మేనిఫేస్టోలను ప్రజలు నమ్మవద్దు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ నుంచి నన్ను గెలిపిస్తే స్వర్గసీమ చేస్తా: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ.పాల్

మన తెలంగాణ/హైదరాబాద్: తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే నాయకులు టిపిసిసి రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా రూ.10 కోట్లు, రూ.50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, రూ.10వేలు మాత్రమే గూగుల్ పే చేసి దరఖాస్తు పంపాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ కోరారు. సోమవారం జంట నగరాల్లో పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్,బిజెపి పార్టీల మేనిఫెస్టోలు నమ్మవద్దని అధికారం కోసమే ప్రకటిస్తున్నారని, గతంలో వారు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నేరవేర్చలేదని మండిపడ్డారు. తమ పార్టీకి దరఖాస్తు చేసినవారి వివరాలను తీసుకుని తమ కోర్ కమిటీ వచ్చి వారిని కలుస్తుందని చెప్పారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున ఆలస్యం చేయవద్దన్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు కార్యాలయానికి వచ్చి కూడా సంప్రదించవచ్చునని చెప్పారు.

రాష్ట్రంలో తాను ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని తెలిపారు. సికింద్రాబాద్‌లోనూ నిలబడమని చెబుతున్నారని, తమది గుర్తింపు కలిగిన పార్టీ కాబట్టి ఈసి సింబల్ ఇచ్చాక ప్రకటిస్తానని తెలిపారు. తనను సికింద్రాబాద్ నుంచి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని స్వర్గసీమగా చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. తాను గెలిచాక విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి సికింద్రాబాద్‌ను స్వర్గంగా మార్చి, 200 దేశాల్లోని వారు ఇక్కడకు వచ్చి చూసేలా చేస్తానన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గెలిచి ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. అర్హత ఉన్నవారికి ఇవ్వలేదు కానీ ఇప్పుడు పెన్షన్ డబుల్ చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. తన మేనిఫెస్టోను కాపీ కొట్టినట్లు పబ్లిక్ టాక్ ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News