Wednesday, May 1, 2024

ఢిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధాని మోడీ, ధోనీల ఫోటోలు

- Advertisement -
- Advertisement -

Photos Of PM Modi, MS Dhoni On Bihar University

విచారణకు యూనివర్శిటీ ఆదేశం

పాట్నా : డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధాన మంత్రితోపాటు ఇతర ప్రముఖుల ఫోటోలు ఉండటం చర్చనీయాంశమయ్యింది. బీహార్ లోని ఓ యూనివర్శిటీ పరీక్షలో చోటుచేసుకున్న ఈ ఘటనను సదరు వర్శిటీ తీవ్రంగా పరిగణించింది. ఆ ఫోటోలను విద్యార్థులే అప్‌లోడ్ చేసినట్టు భావిస్తోన్న అధికారులు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. బీహార్ లోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్శిటీలో డిగ్రీ పరీక్షల కోసం ఇటీవల కార్డులు జారీ చేశారు. ఇందులో కొన్ని అడ్మిట్ కార్డులపై ప్రధాని నరేంద్రమోడీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ థోనీ , బీహార్ గవర్నర్ ఫగూ చౌహాన్ ఫోటోలు ఉన్నాయి.

మధుబనీ, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల పరిధి లోని కాలేజీలకు చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థులకు ఇవి ఎక్కువగా వచ్చాయి. డిగ్రీ పరీక్షల్లో మోడీ, థోనీ ఫోటోలు రావడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై యూనివర్శిటీ అధికారులు స్పందించారు. అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులే తమ ఫోటోలతోపాటు వివరాలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం వాటిని పరిశీలించి అడ్మిట్ కార్డులు జారీ చేస్తాం. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోందని యూనివర్శిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. యూనివర్శిటీ పేరుకు మచ్చ తెచ్చే ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన, పూర్తి విచారణకు ఆదేశించామన్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News