Sunday, April 28, 2024

గుండెపోటుతో పైలట్ మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :ఎయిరిండియా విమాన పైలట్ హిమానిల్ కుమార్ ఢిల్లీ  విమానాశ్రయంలోనే కుప్పకూలి చనిపోయాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. 30 ఏండ్ల లోపు వయస్సులో ఉన్న కుమార్‌కు గుండెపోటు వచ్చి ఉంటుందని, దీనితోనే ఆయన ఎయిర్‌పోర్టులోని టర్మినల్ 3లో చనిపోయినట్లు వెల్లడైంది. ఎయిరిండియా శిక్షణ విభాగంలో అప్పుడు ఆయన శిక్షణా విధులలో ఉన్నట్లు వెల్లడైంది. పూర్తిగా అస్వస్థతకు గురై ఉన్న ఆయనను గమనించి తొటి ఉద్యోగులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయి ఉన్నట్లు గుర్తించారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News