Sunday, April 28, 2024

అగర్తలలో రూ. 4350 కోట్ల ప్రాజెక్టులు ఆవిష్కరించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అగర్తలాలో రూ.4,350 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. త్రిపుర సర్వతోముఖాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రారంభించిన ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్ర వృద్ధి పథానికి ఊతమిస్తాయని మోడీ అన్నారు.

అగర్తలాలో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో పరిశుభ్రత అనేది ప్రజా ఉద్యమంగా మారిందని, ఫలితంగా దేశంలోని చిన్న రాష్ట్రాల్లో త్రిపుర అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరించిందన్నారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ అండ్ రూరల్ – పథకాల కింద రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం “గృహ ప్రవేశ్” కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. “ఈ రోజు 2 లక్షలకు పైగా పేద కుటుంబాలు వారి స్వంత గృహాలను పొందుతున్నాయి, వారిలో ఎక్కువ మంది త్రిపుర తల్లులు, సోదరీమణులు” అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

“గిరిజన సమాజం యొక్క మొదటి ఎంపిక బిజెపి. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో గిరిజన వర్గాలకు రిజర్వ్ చేసిన 27 స్థానాల్లో 24 స్థానాలను బిజెపెి గెలుచుకుంది. ఆదివాసీలకు సంబంధించిన అంశాలకు మేం ప్రాధాన్యం ఇచ్చాం’’ అని మోడీ అన్నారు.

జనజాతీయ వర్గాల జీవితాల అభివృద్ధికి ప్రభుత్వం అంకితమైందని మోదీ అన్నారు. గతంలో రూ. 21,000 కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు రూ. 88,000 కోట్లు. “గత ఎనిమిదేళ్లలో ఈశాన్య ప్రాంతంలో అనేక జాతీయ రహదారులు నిర్మించాము. అనేక గ్రామీణ ప్రాంతాలు కూడా రోడ్ల ద్వారా అనుసంధానించబడ్డాయి… మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం భౌతిక, డిజిటల్ , సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది” అని ప్రధాన మంత్రి మోడీ ఈ సందర్భంగా తెలిపారు.

మేఘాలయ, త్రిపురలో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News