Thursday, May 2, 2024

ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : ఓటరు జాబితాలో మార్పులు , చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారిలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కామారెడ్డి ఈవిఎం గోదాంలో బుధవారం వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఒటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది శాసన సభ ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నందు వల్ల రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. అక్బిర్ 1 వరకు 2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి యువకుల పేర్లు ఈ నెల 30 లోగా ఫామ్ 6 లో బిఎల్వోలకు అందజేయాలని తెలిపారు.

అక్టోబర్ 4 న తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుందన్నారు. ఇంటింటా సర్వేతో పాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్ ఒటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దర ఖాస్తులను స్వీకరించి సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒకే రకమైన ఫొటోలు, మరణించిన వారు,ఓకే ఓటరు వేర్వేరు చోట్ల నమోదు వంటి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలంగించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకిరించాలని అన్నారు. అనంతరం ఈవిఎంలు, వివి ప్యాట్స్ ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేఏరకు ఫస్ట్ లెవల్ తనిఖీలను రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించారు.

బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్ పని చేయు విధానాన్ని పరిశీలించారు. రాజకీయ పార్టీల నాయకుల సందేహాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఈసీఐఎల్ ఇంజనీర్స్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ వెంకట్రావ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News