Tuesday, April 30, 2024

కాంగ్రెస్ తో కలిసి ఎందుకు పనిచేయబోనంటే… : ప్రశాంత్ కిశోర్

- Advertisement -
- Advertisement -

Prashanth Kishore

న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  గ్రాండ్ ఓల్డ్ పార్టీ- కాంగ్రెస్‌ (Congress)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు  పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది లేదని అన్నారు. బీహార్‌లోని వైశాలిలో ఉన్న దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ నివాసం నుంచి తన ”జన్ సురాజ్ యాత్ర”ను మంగళవారంనాడు ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  వివిధ పార్టీలతో కలిసి తాను పనిచేసిన వైనాన్ని, ఆయా పార్టీలు గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. 2017 యూపీ ఎన్నికలను కూడా ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్లే తాను (వ్యూహకర్తగా) ఓడిపోయానన్నారు. దీంతో తన ట్రాక్ రికార్డు దెబ్బతిందని, వారితో పనిచేసేది లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ”మహకూటమితో 2015లో బీహార్‌లో గెలిచాం. 2017లో పంజాబ్‌లో, 2019లో జగన్ మోహన్‌రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచాం. కేజ్రీవాల్‌తో 2020లో ఢిల్లీలో, 2021లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గెలిచాం. కానీ  2017లో కాంగ్రెస్‌తో కలిసి యూపీలో ఓడిపాయాం” అని  ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయరాదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఆ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీ తనంత తానుగా మెరుగయ్యే పరిస్థితి లేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News