Friday, May 3, 2024

పక్కాగా గ్రూప్ 4 పరీక్షలు

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ తిరుపతిరావు

రంగారెడ్డి జిల్లా: గ్రూప్ -4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ తిరుపతి రావు చాంబర్‌లో సోమవారం గ్రూప్ -IV పరీక్షల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -I, మధ్యాహ్నం 2:30 నుంచి 5.00 గంటల వరకు పేపర్-II పరీక్ష ఉంటుందన్నారు.

జిల్లాలో మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, అందుకుగానూ మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లో బడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని సూచించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపర్డెంట్ తోపాటు పరీ క్ష కేంద్రంలో ఉండి, సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శిం చి, అవసరమైన ఆయా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చీఫ్ సూపర్డెంట్లు గైడ్లైన్స్ అన్ని ంటిని పునఃశ్చరణ చేసుకోవాలన్నారు. ఇన్విజ్ లేటర్లు జాప్యం చేయకుండా కరె క్ట్ టైంకు పేపర్ ఇవ్వాలని, టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, రైటింగ్ పాడ్స్ అనుమతించరని తెలిపారు. పరీక్ష కేంద్రాలలోని అన్ని గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవేని సీసీ కెమెరాలు పని చేయునట్లయితే ముందుగా తెలియ జేయాలని చీఫ్ సూపర్డెంట్ లకు సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు ,మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ వారికి సూచించారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, ఓ.ఆర్.ఎస్ పాకెట్లతో ఏఎన్‌ఎమ్ ను, ఆశా వర్కర్ ను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.

ఆయా అధికారులందరూ సమన్వయంతో పని చేసి గ్రూప్ వన్ పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరారు. అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు, ఓ.ఎం.ఆర్ షీట్‌లను ఇచ్చే సమయంలో అభ్యర్థులకు బబ్లింగ్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు. బబ్లింగ్‌లో ఏ మాత్రం పొరపాటు జరిగినా పరిగణలోకి తీసుకోవడం జరగదన్న విషయాన్ని తెలియజేయాలన్నారు.ఈ సమావేశంలో డీఈఓ సుశీందర్ రావు, పోలీసుశాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News